JP Nadda: కాంగ్రెస్‌పై కర్ణాటక బీజేపీ పోస్ట్... జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్ల జారీ

  • ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లను గుంజుకునే ప్రయత్నాలని ఆరోపణ
  • అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు చూస్తున్నాయన్న బీజేపీ
  • పైవ్యాఖ్యలు ప్రతిబింబించేలా సోషల్ మీడియాలో బీజేపీ కర్ణాటక యూనిట్ పోస్ట్
JP Nadda and Amit Malviya summoned by Bengaluru Police

ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లను గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు చూస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మాటలు ప్రతిబింబించేలా ఒక వీడియోను బీజేపీ కర్ణాటక యూనిట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

ఈ సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. అలాగే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ సమన్లలో భాగంగా వారు హాజరయ్యేందుకు అధికారులు వారం రోజుల గడువు ఇచ్చారు.

కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన ఈ వీడియోను కాంగ్రెస్ ఖండించింది. దీనిని తొలగించాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించారు. ఈ వీడియోను తొలగించాలంటూ మంగళవారం ఎక్స్‌కు (ట్విట్టర్) నోటీసులు ఇచ్చారు.

  • Loading...

More Telugu News